న్యూఢిల్లి : ఎపి విభజన హామీలపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. లోక్సభలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడికి ఎపి రాజకీయ సమీకరణాలను వినియోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఎపికి చెందిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఎపి ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం కల్పించడంతోపాటు జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణలపై కాంగ్రెస్ దృష్టి సారిస్తోంది.