నాగ్పూర్ :ఓ జర్నలిస్టు తల్లి, కూతురు హత్యకు దారి తీసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. జర్నలిస్టు రవికాంత్ కాంబ్లే స్థానిక దినపత్రికలో పని చేస్తున్నారు. కాంబ్లే తల్లి ఉషా కాంబ్లే(52) వడ్డీ వ్యాపారం చేస్తుంది. అయితే ఉషా కాంబ్లే, ఆమె మనుమరాలు రాశి(1) శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వడ్డీ పైసల కోసమని రాంబరన్ సాహు(26) ఇంటికి ఉషా వెళ్లింది. డబ్బుల విషయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఆవిడ అదుపుతప్పి మెట్లపై నుంచి కిందపడిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను గొంతు కోసి చంపేశాడు. అంతటితో ఆగకుండా ఏడాది పాప రాశిని కూడా పొట్టనబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మృతదేహాలను తీసుకెళ్లి.. నాలాలో పడేశాడు. అయితే ఉషా ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు కేసును చేధించారు.