పాట్నా : బీహార్ గయా జిల్లాలోని పరియా ప్రభుత్వ పాఠశాలలో బాంబులు లభ్యమయ్యాయి. పాఠశాల మెయిన్ గేటు వద్ద రెండు బాంబులను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఒక బాంబును టిఫిన్ బాక్స్లో అమర్చారు. విద్యార్థులు రాకముందే బాంబులను పసిగట్టడంతో పెనుప్రమాదం తప్పింది. పాఠశాల వద్దకు చేరుకున్న పోలీసులు.. బాంబులను నిర్వీర్యం చేశారు. స్కూల్ వద్ద బాంబులు ఎవరి పెట్టి ఉండొచ్చు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.