ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇవాళ 92వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించనున్నారు. జగన్ తన 92వ రోజు పాదయాత్రను మరికాసేపట్లో కందుకూరు శివారు నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర వెంకటాద్రిపాలెం, అనంతసాగరం క్రాస్, ఎడ్లూరుపాడు, పెదవెంకన్నపాలెం మీదుగా విప్పగుంట వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా ఎడ్లూరుపాడు, పెదవెంకన్నపాలెంలలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం విప్పగుంటలో జగన్ జనంతో మమేకమవుతారు. పాదయాత్రలో జగన్ ఇప్పటి వరకు 1234.9 కిలోమీటర్లు నడిచారు.