బీజేపీ మిత్రపక్షమైనా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి నారాయణ అన్నారు. ఈరోజిక్కడ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. బీజేపీ, వైసీపీలపై మండిపడ్డారు. చివరి బడ్జెట్ వరకు ఎదురు చూశామని, అందుకే ఇప్పుడు ఒత్తిడి పెంచామని పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికలు రావని తెలిసి వైసీపీ నాటకాలాడుతోందని విమర్శించారు. గత ఏడాది రాజీనామాలు చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నిజాయితీగా వ్యవహరించకపోతే వైసీపీకి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హితవు పలికారు.