అమరావతి: బీజేపీపై మూకుమ్మడి దాడి జరుగుతోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడారు. బీజేపీ వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. మిత్రపక్ష టీడీపీ అవాస్తవాలు చెబుతోందన్నారు. నిగ్గు తేలాల్సిన నిజాలు చాలా ఉన్నాయన్నారు. రాష్ట్రానికిచ్చిన నిధులపై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. అమరావతి రాజధానికి రూ.2500 కోట్లు డీపీఆర్ లేకుండా ఇచ్చామన్నారు.