ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చలసాని శ్రీనివాస్, సీపీఐ, సీపీఎం కార్యదర్శులు, పీసీసీ చీఫ్ రఘువీరా తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో విభజన హామీలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై చర్చిస్తారు.