న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని దీన్దయాళ్ ఉపాధ్యాయ్మార్గ్లో నిర్మించిన బీజేపీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రులు, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. రెండు ఎకరాల్లో అత్యాధునిక వసతులతో మూడు బ్లాక్లుగా నిర్మించిన ఈ కార్యాలయంలో మొత్తం 70 గదులున్నాయి. 2016, ఆగస్టులో ఈ కార్యాలయానికి ప్రధాని మోదీ, అమిత్ షా భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే.