హైదరాబాద్: నగరంలోని కొంపల్లిలో ఉన్న శివశివాని కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న హనీషా చౌదరి అనే అమ్మాయి కాలేజీ హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నది. హనీషాది అనంతపురం జిల్లా. ఆమె తండ్రి పేరు బుగ్గయ్య చౌదరి. ఆత్మహత్యకు ముందు హనీషా తన ప్రేమికుడు దక్షిష్ పటేల్తో వీడియోకాల్లో మాట్లాడింది. వీడియో కాల్లో అతడు చూస్తుండగానే ఫ్యాన్కు ఉరేసుకుంది. అతను వెంటనే హాస్టల్ గదికి చేరుకొని.. లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో తలుపులు బద్దలుకొట్టి తెరిచాడు. ఫ్యాన్కు ఉరేసుకున్న హనీషాను అక్కడే ఉన్న స్నేహితురాలి సాయంతో సమీపంలో ఉన్న కొంపల్లి సిగ్మా ఆస్పత్రికి తరలించాడు. ఆస్పత్రికి చేరేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.