ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాజ్ మహల్‌ను సందర్శించిన కెనడా ప్రధాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2018, 12:06 PM

న్యూఢిల్లీ : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తాజ్‌మహల్‌ను సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి ట్రూడూ తాజ్ వద్ద ఫోటోలు దిగారు. భారత్‌లో ఏడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు జస్టిన్ ట్రూడూ చేరుకున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని జామా మసీదును ట్రూడూ కుటుంబం సందర్శించే అవకాశం ఉంది. 2012 తర్వాత భారత్ కు వచ్చిన కెనడా ప్రధాన మంత్రి ట్రూడూనే. 23 వరకూ ఆయన భారత్ లో పర్యటిస్తారు. ప్రధాని మోడీ 2015 ఏప్రిల్ లో కెనడా వెళ్లిన సమయంలో భారత్ లో ప్యటించాల్సిందిగా ఆహ్వానించారు. మోడీ ఆహ్వానం మేరకు భారత్ కు వచ్చిన ట్రూడూ ఆగ్రా, అమతసర్, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నారు. అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ సందర్శించడం ద్వారా కెనడాలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న పంజాబీలకు ఓ పాజిటివ్ సంకేతాన్ని అందించనున్నారు. సోమవారం అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అక్కడ ఐఐఎంలో జరిగే ఎడ్యుకేషన్ అండ్ ఇన్వస్ట్ మెంట్ అనే అంశంపై ఆయన విద్యార్ధులతో డిస్కస్ చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com