బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో యువ కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. బెంగళూరులోని యూబీ సిటీలోని బార్లో ఓ వ్యక్తిని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహ్మద్ హరిస్, అతని అనుచరులు విచక్షణారహితంగా చితకబాదారు. చంపేస్తామని అతడిని బెదిరించారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహ్మద్ హరిస్తో పాటు అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బార్ నిర్వాహకుడిని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు మహ్మద్ శాంతినగర్ ఎమ్మెల్యే ఎన్ఏ హరిస్ కుమారుడు. 2016లో మహ్మద్ సోదరుడు ఉమర్ కూడా శాంతినగర్ ఏరియాలో ఓ వ్యక్తిపై దాడి చేశాడు. మహ్మద్ హరిస్ ను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జి పరమేశ్వర ప్రకటించారు.