అమరావతి: కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల మండిపడ్డారు. జైరామ్ రమేశ్ తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. రాష్ట్ర విభజనలో జైరామ్ రమేశ్ ఆడిన డ్రామాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. టీడీపీని విమర్శించే హక్కు జైరామ్ రమేశ్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రామాలాడినందు వల్లే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ఆంధ్రులను అవహేళన చేయడం జైరామ్ రమేశ్ మానుకోవాలన్నారు. రెండు సార్లు రాజ్యసభకు పంపిన రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.