ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 91వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 91వ రోజు పాదయాత్రను కందుకూరు నియోజకవర్గం పోకూరు శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర నూకవరం, అత్తింటివారిపాలెం, బొంతవారిపాలెం, కాకుటూరు, చెర్లోపాలెం, ప్రశాంతినగర్ మీదుగా కందుకూరు వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా బడేవారిపాలెంలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం కందుకూరులో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.