తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వ దర్శనానికి సుమారు 7 గంటల సమయం పడుతున్నది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 13 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. కాలినడకన తిరుమల చేరుకొనే భక్తులకు ఉదయం 8 గంటల తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. నిత్యం కాలినడక మార్గంలో అర్ధరాత్రి 12 నుంచి అలిపిరి మార్గంలో 14 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల దివ్యదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 20 వేల టోకెన్లు పూర్తయిన తర్వాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలని అధికారులు తెలిపారు.