మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన .. రాష్ర్టంలో మరో 150 పురపాలికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. 2019లో మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న నారాయణ.. మున్సిపాలిటీలు ఎక్కువగా ఉంటే కేంద్రం నిధులు ఎక్కువ వస్తాయని వెల్లడించారు.