ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగుజాతికి అన్యాయం జరిగితే ఊరుకోం: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2018, 03:09 PM

 రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ అన్నివిధాలా నష్టపోయిందని, తెలుగు జాతికి అన్యాయం జరిగితే ఊరుకోబోమని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. రాష్ట్రానికి న్యాయం చేయాలనే భాజపాతో ఆ రోజు పొత్తుపెట్టుకున్నట్టు తెలిపారు. శనివారం ఆయన గుంటూరు జిల్లా కాకాని వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జేఎన్టీయూ భవనాలకు శంకుస్థాపన చేశారు.  అనంతరం జేఎన్టీయూ భవనాల నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ తాను 29 సార్లు దిల్లీకి వెళ్లినా.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామాలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని డిమాండ్‌ చేశారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకు న్యాయం చేయాలని కోరారు. ఆ రోజు ఇచ్చిన హామీలన్నంటినీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నట్టు పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. అందరి సహకారంతో రాష్ట్ర హక్కులను సాధించుకోవాలన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని సీఎం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com