జిల్లాలోని నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఈ రోజు ఉదయం ఓ హృదయ విదారకమైన, దారణ ఘటన చోటుచేసుకుంది. కాంప్లెక్స్లో ఆర్టీసీ బస్సుకింద పడి పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. కాగా బస్సు రివర్స్ చేస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో అతని తల ఛిద్రమైపోయింది. ఛిద్రమైన తలభాగాన్ని పందలు, కుక్కలు లాక్కెళ్లాయి. ఈ ఘటన అక్కడున్న వారందరిచేత కంటతడి పెట్టించింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.