ముంబయి: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన సుధీర్ఘ కెరీర్లో ఎన్నో సంస్థలు, కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించారు. తాజాగా కుర్రాళ్ల కోసం నిర్వహిస్తున్న టీ20 ముంబయి లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు మాస్టర్ బ్లాస్టర్ నిర్ణయించుకున్నారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) సహకారంతో ప్రాబబిలిటీ స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న లీగ్ మార్చి 11 నుంచి 21 మధ్య జరగనుంది. ఆరు జట్లతో నిర్వహించే టోర్నీలో భాగస్వామ్యయ్యే ఫ్రాంఛైజీల కోసం బిడ్లను కూడా ఆహ్వానించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సచిన్ క్రేజ్ను లీగ్ ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని నిర్వాహకులు భావించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ఎంసీఏతో అనుబంధం కలిగిఉండటం ఎప్పటికీ సంతోషమే. టీ20 ముంబయి లీగ్ క్రికెట్ అభిమానులను అలరించేందుకు మాత్రమే కాదని యువ క్రికెటర్లు తమ సత్తాను చాటుకునేందుకు వచ్చిన గొప్ప అవకాశమని సచిన్ పేర్కొన్నాడు.