బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరులోని కసవనహళ్లిలో నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి పెరిగింది. శనివారం కూడా అక్కడ శిథిలాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని భావిస్తున్నామని, అందువల్ల భారీ యంత్రాలను ఉపయోగించడం లేదని కర్ణాటక డివిజనల్ అగ్నిమాపక అధికారి రవిశంకర్ పేర్కొన్నారు. ఈ భవనంలో ఎంత మంది పనిచేస్తున్నారో సరైన లెక్కలేదన్నారు. గాయపడ్డ ఆరుగురి కార్మికులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.