చెన్నై: ఫిల్మ్స్టార్ కమల్హాసన్ త్వరలో రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ దిశగా ఆయన మరో అడుగు ముందుకు వేశారు. మాజీ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి టీఎన్ శేషన్ను కమల్ కలిశారు. చెన్నైలో ఆయన నివాసంలో కమల్ భేటీ అయ్యారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్తో సుమారు 15 నిమిషాల పాటు కమల్ మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తిగా టీఎన్ శేషన్కు గుర్తింపు ఉంది. ఇటీవల శేషన్ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన బాగోలు తెలుసుకునేందుకు వెళ్లినట్లు కమల్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే శేషన్ ఎన్నికల అనుభవాల గురించి తెలుసుకునేందుకు కూడా వెళ్లినట్లు కమల్ వెల్లడించారు. ఆరోగ్యం బాగుంటే మీ పార్టీలోనే చేరేవాడినని శేషన్ చెప్పినట్లు కమల్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ గురించి ఏవైనా అనుమానాలు ఉంటే, వాటిని నివృత్తి చేసుకునేందుకు మళ్లీ విజిట్ చేస్తానని శేషన్కు తెలియజేసినట్లు కమల్ చెప్పారు. శేషన్ కూడా దానికి అంగీకారం తెలిపారన్నారు. ఈనెల 21వ తేదీన కమల్ తన రాజకీయ పార్టీ గురించి కీలక ప్రకటన చేయనున్నారు.