ఒంగోలు: ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర శనివారం నాటికి 90వ రోజుకు చేరింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. నేడు లింగసముద్రం మండలం బంగారక్కపాలెం నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. గాంధీనగర్, వలేటివారిపాలెం,రోళ్లపాడు, పోలినేనిపాలెం ఉప్పలపాడు, కునిపాలెం క్రాస్రోడ్డు, పోకూరు మీదుగా జగన్ పాదయాత్ర కొనసాగనుంది.