ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజస్థాన్‌లో రైతుల వినూత్న నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2018, 10:31 AM

 జైపూర్‌ : రాజస్థాన్‌లోని సికార్‌లో రైతులు వినూత్న నిరసన ప్రదర్శించారు. టోల్‌ రోడ్డు కోసం తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నందుకు నిరసనగా గొతులను తవ్వి అందులో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని సంఘర్ష్‌ సమితిలోని సభ్యుడు నరేంద్ర బటాడ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు గొతిని ఒక అడుగు మేర పెంచుతామని, పగటి వేళ్లల్లో నిరసనలు ప్రదర్శిస్తామని తెలిపారు. సోమవారం ర్యాలీని నిర్వహిస్తామని నరేంద్ర బటాడ్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com