తనకు కొన్నేళ్లు కేటాయించిన కొద్దిపాటి భూమికి పట్టా ఇవ్వనందుకు నిరసనగా ఉత్తర గుజరాత్లోని పటాన్ జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద భాను వాంకర్ అనే దళితుడు ఆత్మాహుతయ్యాడు. అతను గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో నిప్పంచుకోగా, అహ్మదాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. 80శాతం వరకు కాలిన గాయాలతో వాంకర్ శుక్రవారం రాత్రి ఆ ఆసుపత్రిలో మృతి చెందాడు. అతను తన భూమి సమస్యను అనేకసార్లు జిల్లా అధికారులకు తెలిపినా వారు పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశతో ఇలా మృతి చెందాడు. నిరసనల్లో భాగంగా కలెక్టరేట్ వద్ద మరో తొమ్మిది మంది దళితులూ కలెక్టరేట్ ప్రాంగణంలోకి దూకి యత్నించగా ఆత్మహత్యలకు పాల్పడేందుకు వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడుదల చేశారు.
ఈ ఆత్మహత్యతో దళితులు, ఆయా సంఘాలు గుజరాత్లో దళితులు, ఇతర పేదల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపడానికి సన్నద్ధమవుతున్నారు. జిల్లా యంత్రాంగమే వాంకర్ మృతికి బాధ్యులని అతని బంధువొకరు స్పష్టం చేశారు. ఈ ఘటన జరిగిన వాంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే,
విచారణ చేసి పూర్తి వివరాలు తెలపమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు గుజరాత్ ముఖ్యమంత్రి విజరురూపాని తెలిపారు. దళితుల హక్కుల కోసం పోరాడుతున్న రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ శుక్రవారమే పటాన్ బంద్ నిర్వహించింది. మంచ్ కన్వీనరు, స్వతంత్ర ఎమ్మెల్యే జిగేష్ మేవాని బిజెపి ప్రభుత్వానికి ఈ ఘటన సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. గుజరాత్లో దళితులు తమ హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోరాడాల్సి వస్తోందన్నారు. వాంకర్ మృతికి బాధ్యులుగా పరిగణించి వెంటనే కలెక్టర్ను, ఎస్పీని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.