ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.9కే అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2018, 04:11 PM

న్యూఢిల్లీ: భారత టెలికాం మార్కెట్లో ఆపరేటర్ల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి రోజుకో కొత్త ఆఫర్‌తో ముందుకొస్తున్నాయి. కొత్త కస్టమర్ల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న వినియోగదారులు చేజారకుండా ఉండేందుకు టెలికాం కంపెనీలు సర్‌ప్రైజ్ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా జియోకు పోటీగా భారతీ ఎయిర్‌టెల్ రూ.9 రీఛార్జ్‌ ఆఫర్ కేవలం ఒక్కరోజు వాలిడిటీతో వచ్చేసింది. రూ.9 రిఛార్జ్‌పై అన్‌లిమిటెడ్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, రోమింగ్)తో పాటు 100ఎంబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌ల‌ను ప్రిపెయిడ్‌ వినియోగదారులు వాడుకోవచ్చు. గరిష్ఠంగా రోజుకు 250 నిమిషాల కాల్స్ మాత్రమే వినియోగించుకునే వీలుంది. రిలయన్స్ జియో రూ.19 ప్లాన్‌కు పోటీగా ఎంట్రీ లెవల్ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. మైఎయిర్‌టెల్ యాప్, ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా కొత్త ప్లాన్‌ను కస్టమర్లు కొనుగోలు చేసుకోవచ్చు. కోంబో ఆఫర్ సెక్షన్‌లో రీచార్జ్ ప్యాక్ అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే సంబంధిత వినియోగదారులు రీచార్జ్ చేసుకోవాలని సంస్థ తెలిపింది. గమనిక ఈ ఆఫర్ ఒక్క రోజు మాత్రమే వాలిడిటీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com