విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో రిలే నిరహార దీక్షలను చేపట్టారు. హెల్పింగ్ హాండ్స్ ఆధర్యంలో ఈ దీక్షలు పది రోజులు పాటు జరగనున్నాయి. ఈ దీక్షలను మద్దతిస్తూ ఎస్ఎఫ్ఐ కృష్ణ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు ఎన్.కోటి, ఎం.సోమేశ్వరవు, సిటీ కార్యదర్శి సుమంత్ వైస్ ప్రెసిడెంట్ ఓ.యేసు బాబు తదితరులు పాల్గొన్నారు