చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో మొరం పంచాయతీలో విషాదం చోటు చేసుకుంది. శ్రీవెంకటేశ్వర హెచరీస్లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూండగా ఈప్రమాదం చోటు చేసుకుంది. ఎడుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సెప్టిక్ ట్యాంకును క్లీన్ చేయడానికి ఎనిమిది దిగారు. క్లీన్ చేస్తూండగా ఒక్కసారిగా విషయ వాయువులు వెలువడటంతో ఎనిమిది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుగూ ఏడుగురు మృతి చెందారు. మరొకరిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. మృతులు రెడ్డప్ప, రమేష్, రామచంద్ర, కేశవ, గోవిందస్వామి, బాబు, వెంకట్రాజులుగా గుర్తించారు. ఈసంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.