తిరుమల: తిరుమల అలిపిరి చెక్పోస్టు వద్ద మరోసారి తుపాకీ దొరకడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ఒడిశా రిజిస్ట్రేషన్తో ఉన్న కారులో తనిఖీ చేస్తుండగా తుపాకీ భయటపడింది. కారు స్టీరింగ్ వద్ద తుపాకీ దాచి ఉంచారని భద్రతా సిబ్బంది తెలిపారు. దీనికి సంబంధించిన ధ్రువపత్రాలు లేకపోవడంతో తుపాకీతో పాటు రెండు బులెట్లను తనిఖీ అధికారులు సీజ్ చేశారు. నిందితుడిని భువనేశ్వర్కు చెందిన పానీగా గుర్తించారు. ఇతనిపై ఒడిశా రాష్ట్రంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో రెండు సార్లు అలిపిరి వద్ద తనిఖీల్లో తుపాకీ పట్టుబడ్డ విషయం తెలిసింది.