రక్షణ రంగ బడ్జెట్లో భారతదేశం తొలిసారిగా యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించి, ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరింది, అయితే చైనా కంటే చాలా దూరంలో ఉంది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్(ఐఐఎస్ఎస్) ‘మిలటరీ బ్యాలెన్స్ 2018’ పేరుతో ఇచ్చిన నివేదిక ప్రకారం 2017లో భారతదేశం రక్షణ రంగంలో 52.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడం ద్వారా యూకేను అధిగమించింది. 2016లో భారతదేశం రక్షణ రంగంలో 51.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. మరో పక్క 2016లో 52.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిన యూకే 2017లో 50.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది.
ఐఐఎస్ఎస్ నివేదిక ప్రకారం 602.8 బిలియన్ డాలర్ల వ్యయంతో అవెురికా ప్రథమ స్థానంలో ఉండగా, చైనా(150.5 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా(76.7బిలియన్ డాలర్లు), రష్యా(61.2బిలియన్ డాలర్లు), భారత్(52.5 బిలియన్ డాలర్లు) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రక్షణ రంగ బడ్జెట్ కేటాయింపులు భారతదేశం, యూకే మధ్య సైనిక సమతుల్యతను సూచిస్తుందని ఐఐఎస్ఎస్ దక్షిణాసియా సీనియర్ ఫెలో రాహుల్ చౌదరి అన్నారు. భారత తన సైనిక సామర్థ్యాన్ని ఆధునికరించుకుంటుందన్నారు. రక్షణ బడ్జెట్లో అవెురికా తర్వాత స్థానంలో ఉన్న చైనా, భారతదేశం కంటే మూడింతలు ఖర్చు చేస్తూ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది.
2016-17లో చైనా రక్షణ రంగ వ్యయం 25 శాతం పెరిగితే అదే సవుయంలో భారతదేశంలో 2.4శాతం మాత్రమే పెరిగింది. డొక్లాం ఘటన తర్వాత కూడా మిలటరీ సావుర్థ్యంలో చైనా కంటే భారత్ వెనకబడే ఉంది. 2000 సంత్సరం నుంచి చైనా ఆయుధ సంపత్తిని చాలా పెంచుకుంది. పెద్దసంఖ్యలో సబ్మైరెన్లు, ఫ్రిగేట్స్, కార్వట్టీలు నిర్మించుకుంది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలపాలకు అధికంగా దళాలును ఇస్తున్న భారతదేశం మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా రక్షణ రంగ పరిశ్రవుల బలోపేతానికి కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశమిచ్చిందని ఆ నివేదిక చెప్పింది.