కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం కుమారుడు కార్తి సన్నిహితుల నివాసాలలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది. ఎఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ దాడులు నిర్వహిస్తున్నది. ఈ ఉదయం కార్తి సన్నిహితుల నివాసాలపై ఈడీ దాడులు జరిగాయి. మొత్తం మూడు ప్రాంతాలలో దాడులు జరిగినట్లు తెలిసింది.