ట్రెండింగ్
Epaper    English    தமிழ்

89వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2018, 10:14 AM

వైకాపా అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర 89వ రోజు తూర్పుపాళెం క్రాస్ నుంచి ప్రారంభమైంది. ఈ ఉదయం ఆయన తూర్పుపాళెం క్రాస్ నుంచి తన 89వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి ఆయన యాత్ర ప్రకాశం జిల్లాలోనికి ప్రవేశించింది. జగన్ యాత్ర ప్రకాశం జిల్లాలోనికి ప్రవేశించిన సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ రోజు యాత్రలో  పెంట్రాల, కామల్లవారి పాలెం, బలిజపాలెం, తిమ్మారెడ్డి పాలెం, వెంగళాపురం, బంగారక్కపాలెం గ్రామాలలో పర్యటిస్తూ జగన్ అక్కడి ప్రజలతో మాట్లాడనున్నారు. కొత్తపేట, లింగసముద్రం, రామకృష్ణాపురం గ్రామాలలో పార్టీ జెండాలను ఆవిష్కరిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com