వైకాపా అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర 89వ రోజు తూర్పుపాళెం క్రాస్ నుంచి ప్రారంభమైంది. ఈ ఉదయం ఆయన తూర్పుపాళెం క్రాస్ నుంచి తన 89వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి ఆయన యాత్ర ప్రకాశం జిల్లాలోనికి ప్రవేశించింది. జగన్ యాత్ర ప్రకాశం జిల్లాలోనికి ప్రవేశించిన సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ రోజు యాత్రలో పెంట్రాల, కామల్లవారి పాలెం, బలిజపాలెం, తిమ్మారెడ్డి పాలెం, వెంగళాపురం, బంగారక్కపాలెం గ్రామాలలో పర్యటిస్తూ జగన్ అక్కడి ప్రజలతో మాట్లాడనున్నారు. కొత్తపేట, లింగసముద్రం, రామకృష్ణాపురం గ్రామాలలో పార్టీ జెండాలను ఆవిష్కరిస్తారు.