ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాగం పేరుతో కోట్లు వసూలు చేసిన బాబా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2018, 09:29 AM

నెల్లూరు: భక్తి ముసుగులో మరో దొంగ బాబా భక్తులకు భారీగా టోకరా వేశాడు. ఆశ్రమంలో యాగం నిర్వహిస్తున్నానంటూ ఈ బాబా తన అనుచరుల ద్వారా భక్తుల నుంచి కోట్లు వసూళ్లు చేయించాడు. యాగ నిర్వహణకు డబ్బులు ఇస్తే ఆ తర్వాత అంతకు రెట్టింపు ధనం ఇస్తామంటూ బాబా అనుచరులుగా చెప్పుకున్న ఓ జంట భక్తుల నుంచి కోట్లాది రూపాయలు వసూళ్లు చేశారు. అయితే ఆ తరువాత వారు కనిపించకుండా పోవడంతో భక్తులు బాబాను నిలదీశారు. దీంతో అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నెల్లూరు నగరంలో చోటుచేసుకున్నఈ ఘటన సంచలనం సృష్టించింది.


వివరాల్లోకి వెళితే...నెల్లూరు ప్రశాంతినగర్‌లో సుధాకర్‌బాబా అనే వ్యక్తి గురుదత్తాత్రేయ ఆశ్రమాన్నినిర్వహిస్తున్నాడు. ఈ బాబా ఇటీవల 105 రోజుల పాటు నవనాద సంప్రదాయ శ్రీ గురుదత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహాయాగం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.దీంతో ఈ యాగం ఏర్పాట్లు కోసమంటూ మరో జిల్లాకు చెందిన ఒక జంట తమ కుటుంబ సభ్యులతో ఆశ్రమానికి చేరుకుంది.


ఈ క్రమంలో భక్తులకు ఆ దంపతులు యాగానికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను పంపిణీ చేస్తూ...తాము చెప్పినట్లు చేస్తే ఈ యాగం అనంతరం పెద్ద ఎత్తున ధనం సమకూరుతుందని వారు నమ్మబలికారు.దీంతో భక్తులు ఈ బాబాపై తమకు ఉన్న నమ్మకంతో ఒక్కొక్కరూ రూ. 50 వేల చెల్లించి ఆ దంపతులు, వారి కుటుంబ సభ్యుల నుంచి యాగానికి సంబంధించిన పుస్తకాలను కొనుగోలు చేశారు. వారు పుస్తకాలు భక్తులకు ఇస్తూ తాము చెప్పిన విధంగా చేసి సూచించిన మంత్రాన్ని ఆ పుస్తకంలో రాస్తే ఒక్కో పుస్తకానికి రూ.2 వేల చొప్పున తిరిగి ఇస్తామని, తద్వారా ఎన్నో రెట్ల ధనం మీకు సమకూరుతుందని నమ్మబలికారు. దీంతో కొందరు భక్తులు భారీ సంఖ్యలో పుస్తకాలను కొనుగోళ్లు చేయగా, ఈ విషయం తెలిసి మరింతమంది భక్తులు ఆశ్రమానికి తరలివచ్చి పుస్తకాలను కొనుగోలు చేశారంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com