తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి దర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, కాలినడక భక్తులకు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. నిన్న 52,657 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది. నిన్న 17,313 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.33 కోట్లు.