జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి ఫోన్ చేశారు. రఘువీరాతో మాట్లాడిన పవన్ జేఎఫ్సీకి కాంగ్రెస్ మద్దతును కోరడంతో పాటు జేఎఫ్సీ సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు. దీంతో స్పందించిన రఘువీరారెడ్డి తన మద్దతు తెలుపుతూ.. జేఎఫ్సీ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులుగా గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్లు హాజరవుతారని పవన్కు తెలిపారు. ఇటీవల పవన్ జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.