ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ జేఎఫ్‌సీతో ఇబ్బంది లేదు: నేతలతో చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 02:09 PM

పవన్‌ ఏర్పాటు చేసిన జాయింట్‌ ఫ్యాక్ట్స్‌ ఫైండింగ్‌ కమిటీ (జేఎఫ్‌సీ)తో మనకు ఇబ్బంది లేదని చంద్రబాబు అన్నారు. అమరావతిలో జరుగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పవన్‌ పోరాటంలో అర్థం ఉందన్నారు. రాష్ట్రానికి మేలు జరగాలనే కాంక్షతో పవన్‌ వెళ్తున్నారని పేర్కొన్నారు. తనకు తోచిన విధంగా పవన తన పద్దతిలో వెళ్తున్నారని తెలిపారు. మన ఉద్దేశమూ కూడా రాష్ట్రానికి మేలు జరగాలనే కదా అన్నారు.తాను కేసులకు భయపడతానా? కేసులంటే మనకెందుకు భయమని చంద్రబాబు నేతలతో అన్నారు. కాంగ్రెస్‌ పాలిత సీఎంలూ ఉన్నారు, అందరూ కేసులకు భయపడుతున్నారా? అని పేర్కొన్నారు. రాజధానిలో లక్ష కోట్ల అవినీతి అని కేసులు పెట్టారు, ఏం జరిగిందన్నారు. మనపై ఎన్ని కేసులు పెట్టినా అన్నిటికీ క్లీన్‌చిట్‌ వచ్చిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com