ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేకత ఏమీ లేదు: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 12:34 PM

అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాలకు జరిపినట్లే ఏపీకి కేటాయింపులు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో జరుగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేకత ఏమీ లేదన్నారు. మన హక్కుల సాధన కోసమే రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. మనది క్రమశిక్షణ కలిగిన పార్టీ, అనవసరంగా ఒకరిని నిందించం అని పేర్కొన్నారు. నోట్ల రద్దు, ఇతరత్రా సమస్యలు తలెత్తినప్పుడు కేంద్రానికి అండగా నిలిచామన్నారు. రాష్ట్ర విభజన వల్ల చాలా నష్టపోయామని అన్నారు. విభజన హామీల్లో 19 అంశాలు ప్రధానమైనవన్నారు. మన హక్కుల సాధన కోసమే రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. 29 సార్లు ఢిల్లి వెళ్లినా బడ్జెట్‌లో మనకు మళ్లి అన్యాయం చేశారన్నారు. విభజన తప్పు నాటి పాలకులదన్నారు. ఢిల్లిలో మన ఎంపీలు పోరాడి దేశం దృష్టికి రాష్ట్ర సమస్యను తీసుకెళ్లారని పేర్కొన్నారు. మనకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com