న్యూఢిల్లి : పోలవరంపై ఒడిశా దాఖలు చేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా ప్రభుత్వం పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలు తమ అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో మార్చి 30వ తేదీలోగా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా ఈ ప్రాజెక్టకు సంబంధించి ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించాలని గతంలోనే ఒడిశా కోరింది. దీనికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. అయితే ఈ సమావేశం ఎందుకు జరుగలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంనుంచి తమకు సరైన సహకారం అందడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు తెలియజేశాయి.