న్యూఢిల్లి : జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్యు) వైస్ ఛాన్సెలర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆ విశ్వవిద్యాలయం విద్యార్థులు నేడు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. జెఎన్యు విసి ఎం జగదీశ్ కుమార్ ప్రవేశపెట్టిన కొత్త అటెండెన్స్ విధానాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. వర్శిటీ ప్రాంగణంలోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వరకూ విద్యార్థులు ర్యాలీగా వెళ్లి తమ డిమాండ్లను అధికారులకు అందజేయనున్నారు.