అమరావతి:చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి మంత్రులు లోకేశ్, నారాయణ, అచ్చెన్నాయుడు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు, ఎమ్మెల్సీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, కేంద్రంతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై చర్చిస్తున్నారు.