ఆంధ్రపద్రేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రం చేసిన ఖర్చులపై లెక్కలు చెప్పాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజెపి, టిడిపిలను కోరారు. నేటిలోగా తనకు ఈ లెక్కల వివరాలు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. అయితే నేటితో పవన్ విధించిన డెడ్లైన్ ముగిస్తున్నప్పటికీ, ఆయన డిమాండ్కు ఆ రెండు పార్టీలు కూడా స్పందించలేదు.