ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2018, 12:00 PM

అమరావతి : టీడీపీ ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.  ఈ భేటీలో కేంద్రంతో సంబంధాలు, విభజన హామీల సాధన, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై  ప్రధానంగా చర్చిస్తారు.రెవెన్యూ లోటు విషయంలో న్యాయపోరాటం, వైకాపా ఎంపీల రాజీనామా నిర్ణయం, జనసేనాని పవన్ కల్యాణ్ దూకుడు పెంచడం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. అలాగే విభజన చట్టంలోని అంశాలు, విభజన హామీల అమలు విషయంలో కేంద్రం వైఖరి తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ భేటీలో ఆర్థిక మంత్రి యనమల  రామకృష్ణుడు, మంత్రి, పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com