అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లిరామయ్య మృతి పట్ల పలువురు ఏపీ మంత్రులు సంతాపం తెలిపారు. మంత్రులు నారా లోకేశ్, కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, జవహర్, మంత్రి కామినేని శ్రీనివాస్లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుల్లిరామయ్య మృతి రాష్ట్రానికి తీరని లోటని వారు పేర్కొన్నారు.