ఒడిశా: ఒడిశాలో లంచం తీసుకుంటున్న ఆదాయ పన్ను శాఖ అధికారిని సీబీఐ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. భద్రక్లోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఐటీ అధికారి నిరంజన్ బెహెరా లంచం తీసుకుంటుండగా..సీబీఐ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం నిరంజన్ బెహెరా ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. అతని ఇంట్లో నుంచి రూ.2లక్షల నగదు, 700 గ్రాముల బంగారు ఆభరణాలు, పలు ప్లాట్లకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు అకౌంట్లను సీజ్ చేశారు.