-చంద్రబాబు సారథ్యంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్
-పట్టభద్రుల, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి
-టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలుపించుకుందాం
-శాసన మండలికి పంపించి రాష్ట్ర అభివృద్ధిలో
-భాగస్వాములం అవుదాం
-ఒంగోలు, మార్కాపురం ఎన్నికల ప్రచారంలో
-మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
ఒంగోలు, మేజర్న్యూస్ : తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్ధులను అత్యధిక మెజార్టీతో గెలిపించి, శాసన మండలీలోకి పంపించిన్నప్పుడే రాష్ట్ర ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖామంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. సోమవారం ఒంగోలు, మర్కాపురం ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి శిద్ధా రాఘవరావు, ఒంగోలులో దామచర్ల పాల్గొ న్నారు. ఉదయం నగర పరిధిలోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓటర్లతో సమావేశం అయ్యారు. మంత్రితో పాటు స్ధానిక శాసనసభ్యులు దామచర్ల జనా ర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న నూతన రాష్ట్రాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి పథంలో చంద్రబాబు నడిపించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర అగ్రగామీగా నిలుస్తోందన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతోందన్నారు. ఇంకా రాష్ర్టం శరవేగంగా రాష్ట్ర అభివృద్ధి చెందా లంటే శాసన మండలీలో కూడా తెదేపా అభ్యర్ధులు ఉండాలన్నారు. ఈ నేప థ్యంలో మార్చి 9న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నిలకు సంబంధించి పట్టభద్రుల, ఉపాధ్యాయులు అభ్యర్థులను తేదేపా బరిలోకి దించిందన్నారు. పట్టభద్రులు పట్టాబి రామిరెడ్డి, ఉపాధ్యాయులు వాసుదేవ నాయుడు అభ్యర్థులుగా ఉన్నా రన్నారు. అభ్యర్ధులను అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసన మండలీకి పంపి రాష్ర్ట అభివృద్ధిలో భాగస్వాములం అవ్వదామని మంత్రి శిద్ధా రాఘవరావు, దామచర్ల జనార్ధన్ పిలుపునిచ్చారు. మొదటి జరిగిన క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓటర్ల సమావేశంలో కళాశాల అధినేత నిడమనూరి నాగేశ్వరరావు, మార్కాపురంలో స్ధానిక పార్టీ నేతలు ఉన్నారు.