న్యూఢిల్లి : కోర్టుల్లో సిసిటివిలు అమర్చడంపై ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు హాల్స్లో సిసిటివిలను అమర్చాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. సిసిటివిల ప్రధానోద్దేశ్యం కోర్టులకు భద్రత కల్పించడమేనని, కోర్టు ప్రొసీడింగ్లను రికార్డు చేయడం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 5వ తేదీకి వాయిదా వేసింది.