త్రిపుర శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించే స్థితిలో లేమని కాంగ్రెస్ పార్టీ గుర్తించినట్లు కనిపిస్తోంది. త్రిపుర శాసనసభ ఎన్నికల్లో విజయంపై ఆ పార్టీ ఆశలు వదులుకుంటోంది. లెఫ్ట్ వ్యతిరేక ఓట్లను చీల్చి, బిజెపి ఓడించే దిశగా కాంగ్రెస్ కృషి చేస్తోంది. దాదాపు అన్ని స్థానాల్లోనూ సిపిఎం – బిజెపి ముఖాముఖీ పోటీ పడుతున్నాయి.