విజయనగరం : విజయనగరంలో నూతనంగా నిర్మించిన ఏసీబీ కార్యాలయాన్ని కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సుజయకృష్ణ రంగారావు, ఏసీబీ డీజీ ఠాకూర్లు పాల్గొన్నారు. నూతన ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.... లంచాన్ని పారద్రోలి ఒక పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాలకన్నా ఆంధ్రాకే వృద్ధిరేటు ఎక్కువగా ఉందని అన్నారు. పాలనలో పారదర్శకత పెరగాలంటే అవినీతి తగ్గాలని, అవినీతి తొలగితేనే పేదలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయన్నారు.