విజయవాడ : మహిళల ఆరోగ్య భద్రతపై నగరంలో ఆరోగ్య దీప్తి పేరిట అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. నగరంలోని శేషసాయి కల్యాణ మండపంలో స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు మంత్రి కామినేని శ్రీనివాస్ అతిథిగా హాజరవ్వగా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనురాధ, ఎంపి కొనకళ్ల నారాయణలు పాల్గొన్నారు.