తిరుపతి: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటి ఈషా రెబ్బా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆమె వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అదికారులు దగ్గరుండి ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి పట్టువస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.