ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోదా, పోలవరంపై పోరాటానికి రాహుల్‌ పిలుపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 10, 2018, 04:39 PM

   విజయవాడ : హోదా, పోలవరంపై పోరాటం కోసం రాహుల్‌ పిలుపునిచ్చారని పిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. ఈ మేరకు మార్చి 6, 7, 8వ తేదీలలో చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 20 నుంచి 28 వరకు అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద దీక్షలు చేపట్టనున్నామని చెప్పారు. మార్చి 2న జాతీయ రహదారుల దిగ్భందం ఉంటుందన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేసే జెఎసికి తాము సహకరిస్తామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఎవరితోనైనా కలిసి పని చేస్తామని అన్నారు. ఏపికి న్యాయం చేయాలనే కాంగ్రెస్‌ విభజన చట్టం చేసిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని చెప్పిన బిజెపి అన్యాయం చేస్తోందని అన్నారు. చంద్రబాబు రహస్య ఎజెండాలు మానుకోవాలని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com