ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విభజన హామీలపై జేఎఫ్‌సీ: పవన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 10, 2018, 03:29 PM

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలకు సంబంధించి సంయుక్త నిజనిర్థారణ కమిటీ (జేఎఫ్‌సీ) ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మాజీ అధికారులు, విద్యావేత్తలతో పాటు సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు, తదితరులతో జేఎఫ్‌సీని ఏర్పాటు చేయాలని ట్విటర్‌లో తెలిపారు. విభజన హామీల అమలు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న అంశాలపై విస్తృతంగా చర్చించాలని పవన్‌  పేర్కొన్నారు.














SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com